9 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

బతుకమ్మ:బిచ్కుంద : బిచ్కుంద మండలంలోని కందర్ పల్లి గ్రామ శివారులో సంజీవ్ పటేల్ కు చెందిన కంది చేనులో  పేకాట ఆడుతున్న  9 మందిని అరెస్ట్ చేసినట్లు బిచ్కుంద ఎస్ఐ మోహన్ రెడ్డి తెలిపారు. విశ్వాసనీయ సమాచారం మేరకు దాడి చేసి  తొమ్మిది మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ.18440 నగదు, ఐదు బైకులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.