8సెల్ ఫోన్లు రికవరి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ కమిషనర్ ఆఫీసులో వివిధ పోలీస్ స్టేషన్లో పోగొట్టుకున్న 8 సెల్ ఫోన్లు రికవరీ చేసి వాటి యజమానులకు అప్పగించినట్లు నిజామాబాద్ డిసీపీ(అడ్మిన్) బస్వారెడ్డి తెలిపారు. సోమవారం  నిజామాబాద్ కమిషనర్ ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఐఆర్ ఆపరేటర్ సుష్మ, డబ్ల్యుపీసీని డిసిపి అభినందించారు.