Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 February 2025, 1:19 pm Posted by : ramakrishna

కుంభమేళాలో 60 కోట్ల మంది పుణ్యసాన్నాలు

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

వెబ్, న్యూస్, బతుకమ్మ :  ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 22 మధ్య పుణ్యసాన్నం ఆచరించిన వారి సంఖ్య 60 కోట్లకు చేరిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. యూపీ ప్రభుత్వం సామర్థ్యం  ఏంటో చాటి చెప్పేందుకు.. మహాకుంభ్ నిర్వహణ ఒక్కటి చాలు అన్నారు. మహాకుంభ్ శక్తిని యావత్ ప్రపంచం కీర్తిస్తోందన్నారు. అభివద్ధిని కోరుకోని వారు దేశ సామర్థ్యంపై నమ్మకం లేని వారు కుంభమేళాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని యోగి విమర్శించారు.