58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని చంద్రశేఖర్ కాలనీలోని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం ఆధ్వర్యంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో వివిధ రకాల పుస్తకాలు ప్రదర్శనలో ఉన్నాయి. పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని గ్రంథాలయాధికారి పి.బుగ్గారెడ్డి సూచించారు. పుస్తక ప్రదర్శన, కవి సమ్మేళనం, రచయితల పరిచయం, చిత్రలేఖనం, వ్యాసరచన, పోటీలు నిర్వహించడమైనది.ఈ కార్యక్రమంలో సహాయ గ్రంథపాలకులు పట్టేం మధు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, రచయితలు, పాఠకులు పాల్గొన్నారు.