42 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టివేత

  రుద్రూర్,  బతుకమ్మ  :   రుద్రూర్ మండలంలోని జేయన్సీ కాలనీలో షరీఫ్ ఉద్దీన్ ఇంట్లో పిడీఎస్ బియ్యం నిల్వ ఉంచారన్న పక్కా సమాచారం మేరకు పోలీసులు ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇంట్లో ఉన్న 42 క్వింటాళ్ల  పిడిఎస్ బియ్యం స్వాధీన పర్చుకుని షరీఫ్ ఉద్దీన్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయన్న వెల్లడించారు.