. పనులను త్వరగా పూర్తి చేయాలి
. ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ, బతుకమ్మ: జాకోరా ఎత్తిపోతల నిర్మాణంతో తొమ్మిది గ్రామాల పరిధిలోని 4,470 ఎకరాలకు భూమికి సాగునీరందుతుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలం జాకోర ఎత్తి పోతల పథకం నిర్మాణం కోసంజాకోర లో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఎత్తిపోతల పథకం పనుల్లో నాణ్యత పాటించాలని, పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అదికారులను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులునాయకులు అధికారులు పాల్గొన్నారు.