జైత్రయాత్రకు తరలిన 327 సంఘ నాయకులు
ఇందూర్, బతుకమ్మ: గద్వాల్ జోగులాంబ జిల్లాలో నిర్వహించే యూనియన్ మహాసభకు ఆర్మూర్ డివిజన్ నుంచి 327 సంఘ నాయకులు, సభ్యులు శనివారం తరలి వెళ్లారు. విద్యుత్ శక్తి రంగంలో 70 వసంతాలు పూర్తి చేసుకున్న ఐఎన్టియుసి అనుబంధ సంస్థ 327 నూతన డైరీ ఆవిష్కరణను అక్కడే చేపడుతున్నామని అధ్యక్షుడు సల్ల శ్రీనివాస్ యాదవ్, కార్యదర్శి చందర్ నాయక్ తెలిపారు.