25 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్న టాస్క్ పోర్స్ పోలీసులు
వర్ని, బతుకమ్మ: రేషన్ బియ్యం కోనుగోలు చేసి ఆక్రమంగా నిలువ ఉంచిన వ్యక్తిని పట్టుకుని టాస్క్ పోర్స్ పోలీసులు 25 క్వింటాళ్ల రేషన్ బియ్యంను పట్టుకున్నారు. నిజామాబాద్ ఇంచార్జీ సిపి సింధు శర్మ అదేశాల మేరకు టాస్క్ పోర్స్ ఎసిపీ నాగేంధ్ర చారీ అధ్వర్యంలో సిఐ అంజయ్య , సిసిఎస్ సిబ్బంది మోస్రా మండల కేంద్రంలో శనివారం దాడులు నిర్వహించారు. పిడిఎస్ బియ్యం సేకరణ, కోనుగోలు చేసి నిల్వ ఉంచిన వ్యక్తిని పట్టుకుని వర్ని పోలీసులకు అప్పగించారు.