ఒకే ఆటోలో 24 మంది స్కూల్ పిల్లలు!

నాగర్ కర్నూల్, బతుకమ్మ:  నాగర్ కర్నూల్ లో ఒకే ఆటోలో 24 మంది పిల్లలను ఎక్కించుకుని  డ్రైవర్ స్కూల్ కి  తీసుకెళ్తున్నాడు.  ఆటోని ఆపి పిల్లలను మరో వాహనంలో స్కూల్ కి  ట్రాఫిక్ ఎస్సై కళ్యాణ్ పంపించారు.  పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఆటోను సీజ్ చేశారు.