218 మంది కానిస్టేబుళ్లకు పోస్టింగ్ లు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: పోలీసుశాఖలో నూతనంగా రిక్రూట్ అయిన సివిల్ కానిస్టేబుళ్లకు పోలీస్ స్టేషన్ లలో పోస్టింగ్ లు ఇస్తూ నిజామాబాద్ ఇన్ చార్జి కమిషనర్ సింధుశర్మ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాకు 218 మంది సివిల్ కానిస్టేబుళ్లను కేటాయించారు. ఈనెల 21న శిక్షణ పూర్తి చేసుకున్న 150 మంది పురుష, 68 మంది మహిళా కానిస్టేబుళ్లను పోలీస్ స్టేషన్ లకు అలాట్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.