హైదరాబాద్, బతుకమ్మ: ప్రత్యేక ఆర్ధిక పెట్టుబడి సహాయం కింద 2024-25 పథకం నిర్వహణలో కీలకమైన మైలెస్టోన్స్ సాధించినందుకు జాతీయ రోడ్డు రవాణా శాఖ రాష్ట్రాలకు ప్రోత్సాహకంగా ఆర్థిక సాయం ప్రకటించింది. ఇందులో భాగంగా తెలంగాణ అదనపు ప్రోత్సాహక సాయంగా మైల్ స్టోన్ – 1లో రూ.125 కోట్లు, మైల్ స్టోన్ – 2లో రూ.51.5 కోట్లు అర్హత సాధించింది. రాష్ట్ర ప్రభుత్వం 15 ఏళ్లు పైబడి ఉన్న రవాణా వాహనాలు తొలగించేందుకు స్క్రాప్ చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక ను పంపినది. ఈ పథకం కింద రూ.75 కోట్లకు అర్హత సాధించింది. ప్రాధాన్యతగా తీసుకున్న రాష్ట్రంలోని 21 జిల్లాలకు రూ.31.5 కోట్లు, మిగతా జిల్లాలకు రూ.20కోట్లు ఇలా మొత్తం రూ.50.5 కోట్లు ప్రోత్సాహకం అందనుంది.