వరంగల్, బతుకమ్మ : మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు తెలంగాణ పోలీసులు చేస్తున్న కృషి ఫలిస్తోంది. గురువారం వరంగల్లో మల్టీ జోన్-1 ఐజీ ఎస్. చంద్రశేఖర్రెడ్డి ఎదుట 14 మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు, ఒక మిలీషియా కమాండర్ ఉన్నారు.
