Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 5:50 pm Posted by : ramakrishna

రోడ్డు ప్రమాదంలో 12 మంది దుర్మరణం

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

కర్నూల్ జిల్లా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది దుర్మరణం పొందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్నూల్ జిల్లా మంత్రాలయం మండలం చిలకలదోన వద్ద గురువారం వేకువ జామున మూడున్నరకు దారుణ రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక రాష్ట్రం చికమగులూరు ప్రాంతానికి చెందిన యాత్రికులు బొలెరో వాహనంలో మంత్రాలయం వస్తుండగా ఒక సిమెంట్ ట్యాంకర్ బొలెరోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

 

12 people killed in road accident

 

దాంతో వాహనంలో ప్రయాణిస్తున్న 21 మందిలో 8 మంది అక్కడిక్కడే మరణించగా, నలుగురు హాస్పిటల్లో మరణించారు. మిగిలిన వారు కర్నూల్ ఎమ్మగనూరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.

 

12 people killed in road accident