11శాతం మంది పట్టభద్రులకు ఓటేయడం రాలే..

. చెట్లుబాటు కాని పట్టభద్రుల ఓట్లు 28వేలు కరీంనగర్, బతుకమ్మ: శాసన మండలి ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్  పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో సుమారు 11శాతం మందికి ఓటు వేయడం రాలేదు. పోస్టల్ బ్యాలెట్ తో కలుపుకుని సుమారు 2,52,100 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కను వినియోగించుకోగా, అందులో 28000 ఓట్లు చెల్లుబాటు కాలేదు. సుమారు 2,24,000 వేల ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు. చెల్లుబాటు కాని ఓట్లను రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలాసత్పత్తి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.