- కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్.సాయ గౌడ్
ఇందల్వాయి, బతుకమ్మ : భారత గడ్డపై సిపిఐ పార్టీకి వంద సంవత్సరాల మైలురాయిలో భాగంగా ఇందల్వాయిలో కరపత్రాల ప్రచారం చేయడం జరిగిందని కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సిహెచ్ సాయి గౌడ్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ బస్సు జాతర, బాసరలో ప్రారంభమై ఫకీరాబాద్, నవిపేట్ సారంగాపూర్, అర్సపల్లి, నిజామాబాద్, పాత గంజి నుండి బోర్గంపి, మాధవ నగర్, ధర్మారం, నడిపల్లి, డిచ్పల్లి స్టేషన్ నుండి రెండు గంటల వరకు ఇందల్వాయి టోల్గేట్ దగ్గరకు వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ సాయ గౌడ్, యాదవుల సంఘం నాయకులు గొల్ల శ్రీనివాస్, రాంబాబు,తదితరులు పాల్గొన్నారు.