Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 April 2025, 7:54 pm Posted by : ramakrishna

ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఫలితాలు

బతుకమ్మ,మోర్తాడ్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించి విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలో వంద శాతం ఫలితాలు సాధించారు. మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లీ, ధర్మోరా, పాలెం, మోర్తాడ్ మండల కేంద్రంలోని బాలికల పాఠశాల, సుంకేట్, తిమ్మాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలల్లో 100% ఫలితాలు రావడంతో ఉపాధ్యాయులు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. శెట్పల్లిలో ఉరడి సాహిత్య  555/600 మార్కులు, పాలెం పాఠశాలలో శ్రీజ  528/600 మార్కులు సాధించారు. దీంతో పాఠశాలల్లో 100% ఫలితాలు రావడంతో ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచి పెట్టుకున్నారు. కార్యక్రమంలో శెట్టి పెళ్లి పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

100% results in government schools