Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 March 2026, 4:52 pm Posted by : ramakrishna

పదవ తరగతి పరీక్షలకు 100 శాతం హాజరు

 

భిక్కనూరు, బతుకమ్మ

 

భిక్కనూరు మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదవ తరగతి పరీక్షలకు విద్యార్థులు 100 శాతం హాజరయ్యారని ఎంఈఓ రాజాగంగా రెడ్డి తెలిపారు. జడ్‌పిహెచ్‌ఎస్ గర్ల్స్ భిక్నూర్ పాఠశాలలో 158, జడ్‌పిహెచ్‌ఎస్ బాయ్స్ భిక్నూర్ పాఠశాలలో 177, జడ్‌పిహెచ్‌ఎస్ పెద్ద మల్లారెడ్డి పాఠశాలలో 96, జడ్‌పిహెచ్‌ఎస్ జంగంపల్లి పాఠశాలలో 202 మొత్తం 4 పాఠశాలల్లో 633 మంది విద్యార్థుల్లో 633 మంది పరీక్షలకు హాజరై 100 శాతం నమోదవగా పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని అధికారులు తెలిపారు.