10 తులాల బంగారం చోరీ

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నగరంలోని ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ జరిగింది. ఇండియన్ గెస్ట్ హౌస్ సమీపంలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన దుండగులు పది తులాల బంగారు ఆభరణాలతోపాటు నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.