Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 November 2025, 7:11 pm Posted by : ramakrishna

మద్యం సేవించి వాహనం నడిపినందుకు 10 వేల జరిమానా

 

బతుకమ్మ, ఏర్గట్ల:

ఏర్గట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తులను కౌన్సిలింగ్ చేసి మంగళ వారం ఆర్మూర్ కోర్టు ఎదుట హాజరు పరచడం జరిగిందని ఏర్గట్ల ఎస్సై రాజేశ్వర్ తెలిపారు. ఇట్టి సందర్భంలో జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలం కోజన్ కొత్తూరు కు చెందిన కే నానీ మద్యం సేవించి వరి కోత మిషన్ ను డ్రైవింగ్ చేసి పట్టు బడి నందున ఆర్మూర్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ మోటారు వాహన (సవరణ ) చట్టం 2019 ప్రకారం 10,000/జరమాన విధించడం జరిగిందని తెలిపారు. ఏర్గట్ల ఎస్సై రాజేశ్వర్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రజలందరూ చట్టాలకు లోబడి రోడ్డు భద్రతకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.