వైవాహిక అత్యాచారం.. వివాహ వ్యవస్థకు ప్రమాదకరం

న్యూ డిల్లీ : వైవాహిక అత్యాచారాన్ని నేరంగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు త్వరలో విచారణ జరుపనున్నది. రాజ్యాంగ బెంచ్‌ ముందున్న జాబితా చేసిన పిటిషన్‌ను విచారించిన అనంతరం.. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌ విచారించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఎదుట న్యాయవాది ప్రస్తావించగా.. ఈ విషయాలను ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించాల్సి ఉందని, ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం...