భారీ వర్షాలపై జగన్ సమీక్ష
ఏపీలో వర్షాలు, నదుల్లో వరద ప్రవాహం, సహాయ పునరావాస కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లతో సీఎం వైయస్.జగన్ ఇవాళ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్ఫ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇందులో కలెక్టర్లను అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. గోదావరితో పాటు ఇతర నదుల్లో వరద పరిస్దితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, ప్రజలు వర్షాలు, వరదల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ కోరారు....